దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా 7 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 6,093 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 9, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,84,729 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 31 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,121 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 49,636 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.70 శాతం:
దేశంలో ప్రస్తుతం 49,636 (0.11%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 6,768 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,39,06,972 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.70 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక సెప్టెంబర్ 8, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 88.87 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 8న 3,16,504 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY