ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎంసీడీ ఫలితాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎంసీడీలోని మొత్తం 250 వార్డులకు గానూ, ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. మేయర్ పదవీ దక్కించుకోవాలంటే మెజార్టీ మార్క్126 వార్డులు గెలుచుకోవాల్సి ఉండగా, ఆప్ 134 వార్డుల్లో ఘనవిజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డులు, కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్స్ మూడు వార్డుల్లో విజయం సాధించారు. 2007 నుంచి వరుసగా మూడు సార్లు ఎంసీడీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ, ఈసారి కొన్ని స్థానాలతో విజయాన్ని కోల్పోయింది. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఎంసీడీలో బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం అనంతరం ఏర్పాటు చేసిన సభలో పార్టీ కార్యకర్తలు మరియు అభ్యర్థులను ఉద్దేశించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. ఇంతటి గొప్ప విజయానికి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు మరియు అభ్యర్థులు అందరికీ చాలా అభినందనలు. ఇప్పుడు అందరం కలిసి ఢిల్లీని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. “మార్పు తీసుకొచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు, ఢిల్లీ ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతలను మేము నిర్వర్తించాము, నాపై నమ్మకం ఉంచి నాపై ప్రేమను అందించినందుకు మీకు రుణపడి ఉంటాను” అని కేజ్రీవాల్ అన్నారు. ఫలితాలు రావడంతో రాజకీయాలు అయిపోయాయని, ఇక ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అభ్యర్థులు, పార్టీలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అభివృద్ధికి కలిసి పని చేసేలా బీజేపీ, కాంగ్రెస్లు సహకరించాలన్నారు. అలాగే ఢిల్లీని బాగు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుతున్నాను, కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎంసీడీని అవినీతి రహితంగా మార్చాలని, అందుకు పూర్తిగా కృషి చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE