ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నాడు 2021-22 నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలో హోటళ్ళు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉండటానికి అనుమతి ఇచ్చారు. ముందుగా లైసెన్స్ పొందిన హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో బాల్కనీ, టెర్రస్ వంటి ప్రదేశాల్లో మద్యం సేవించాలని ఎక్సైజ్ విధానంలో పేర్కొన్నారు.
ఎక్సైజ్ ఢిల్లీ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, ఈ కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు, మద్యం మాఫియాను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఢిల్లీలో చట్టబద్దమైన మద్యపాన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించడంపై ఈ పాలసీలో ప్రస్తావించలేదు. మరోవైపు కొత్త విధానం ప్రకారం ఇకపై ఢిల్లీ ప్రభుత్వం రిటైల్ మద్యం వ్యాపారంలో యాక్టీవ్ గా పాల్గొనదు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాలను మూతపడి, ప్రైవేట్ దుకాణాలకు ప్రోత్సాహం లభించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ