కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన అనంతరం ఈ 2 డీజీ ఔషధ సాచెట్లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధ వినియోగానికి సంబంధించి డీఆర్డీవో మంగళవారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రోగులకు 2 డీజీ ఔషధాన్ని వైద్యుల సంరక్షణ మరియు ప్రిస్క్రిప్షన్ కింద ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
డీసీజీఐ అనుమతి ప్రకారం కరోనా రోగులకు 2 డీజీ ఔషధ వినియోగానికి సూచనలు:
- ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సలో అనుబంధ చికిత్సగా అత్యవసర ఉపయోగం కోసం 2 డీజీ ఆమోదించబడింది.
- ఈ 2 డీజీ ఔషధాన్ని వీలైనంత త్వరగా వైద్యులు మధ్యస్తం నుంచి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు గరిష్టంగా 10 రోజుల వరకు సూచించాలి.
- అనియంత్రిత మధుమేహం, తీవ్రమైన గుండె సమస్య, ఏఆర్డీఎస్(అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్), తీవ్రమైన హెపాటిక్ మరియు రెనాల్ ఇంపైర్మెంట్ ఉన్నరోగులపై 2 డీజీ ఔషధం ఇంకా అధ్యయనం చేయలేదు, అందువల్ల వారంతా జాగ్రత్త వహించాలి.
- గర్భిణీలు, పాలిచ్చే మహిళలు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికీ 2 డీజీ ఔషధాన్ని ఇవ్వకూడదు.
- కరోనా రోగులు లేదా సంబంధిత వ్యక్తులు 2 డీజీ ఔషధ సరఫరా కోసం [email protected] మెయిల్ ద్వారా డాక్టర్ రెడ్డి ల్యాబ్ సంస్థను సంప్రదించమని తమ ఆసుపత్రులను కోరాలని డీఆర్డీవో సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ