భారతదేశపు మొట్ట మొదటి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) రైలు ఫస్ట్ లుక్ను ఎన్సీఆర్టీసీ చైర్మన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా శుక్రవారం నాడు ఆవిష్కరించారు. హై-స్పీడ్, హై-ఫ్రీక్వెన్సీ ఆర్ఆర్టీఎస్ ప్రయాణికుల రైళ్లను పూర్తిగా ప్రభుత్వ “మేక్ ఇన్ ఇండియా” కింద తయారు చేయడం చాలా గర్వకారణమని ఆయన అన్నారు. ఫేజ్-1 లో ముందుగా ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య 82 కిలోమీటర్ల దూరంలో ఈ అత్యాధునిక రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ఆర్ఆర్టీఎస్ రైళ్లను ముందుగా ఈ క్యారిడార్ లో ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీ నుంచి మీరట్ కు రోడ్డుమార్గంలో 3-4 గంటలు పడుతుండగా, ఈ రైళ్ల వలన ప్రయాణం సమయం 60 నిమిషాలకు తగ్గనుంది. ఈ మార్గంలో విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించిన తరవాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందుగా కారిడార్ లో కొంతభాగం వరకు ఈ రైళ్ల సేవలను 2023 లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొత్తం కారిడార్ 2025 లో ప్రారంభించనున్నారు. అలాగే ఆర్ఆర్టీఎస్ ఫేజ్-1 లో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్-ఎస్ఎన్బి మరియు ఢిల్లీ-పానిపట్ కారిడార్ లలో కూడా పనులు ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu