దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు దేశాలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భారత్ కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. భారత్ లో తీవ్రతరం అవుతున్న కోవిడ్ సంక్షోభం చూస్తే ఆందోళనకరంగా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు. భారత్ కు సహాయపడే దిశగా గూగుల్ సంస్థ మరియు ఉద్యోగులు కలిసి గివ్ ఇండియా, యునిసెఫ్ కు రూ.135 కోట్ల నిధులను అందజేస్తున్నట్టు ప్రకటించారు. వైద్యసామాగ్రి కోసం, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇచ్చే సంస్థల కోసం, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడేలా ఈ నిధులను అందజేస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.
అలాగే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల స్పందిస్తూ, భారత్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. సహాయం చేసేందుకు యుఎస్ ప్రభుత్వం ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ లో సహాయక చర్యలకు సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ తన వాయిస్, వనరులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఇక క్లిష్టమైన ఆక్సిజన్ కాన్సెన్ట్రేషన్ పరికరాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ మద్దతు ఇస్తుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ