భారత్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారత్లో కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గురువారంతో పోలిస్తే 21.3 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,68,372కి చేరింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో.. మహారాష్ట్రలో 40,925, పశ్చిమ బెంగాల్లో 18,213 కేసులు, ఢిల్లీలో 17,335 కేసులు, తమిళనాడులో 8,981 కేసులు, కర్ణాటకలో 8,449 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 285 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో, దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,463కి చేరినట్టు కేంద్ర వైద్య,ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ