దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1,23,104 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 830 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.67 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768 కు చేరుకుంది. అలాగే కరోనా వలన కొత్తగా మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,981 కి పెరిగింది.
మరో 1,771 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,40,95,180 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 21,607 (0.05%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనే కొంత పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY