ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఘోర ప్రదర్శనతో భారత్ జట్టు తొలిటెస్ట్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కీలక పేస్ బౌలర్ మహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్లోని మిగిలిన మూడు టెస్టులకు దూరం కానున్నాడు. తొలిటెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో షమీ చేతికి గాయమవడంతో రిటెర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. అనంతరం స్కానింగ్లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గాయం వలన షమీ మిగిలిన సిరీస్ లో ఆడే అవకాశాలు లేవని సమాచారం. ఓవైపు జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం, తొలిటెస్ట్ తర్వాత కెప్టెన్ కోహ్లీ ఇండియాకు తిరిగి రావడం, షమీ వంటి కీలక ఆటగాళ్లు గాయాలు పాలవడంతో పర్యటనలో జట్టు విజయావకాశాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. షమీ జట్టుకు దూరమైతే అతని స్థానంలో నవదీప్ సైనీ లేదా మహమ్మద్ సిరాజ్లలో ఒకరికి అవకాశం దక్కనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ