ఒడిశా ప్రభుత్వం భారత మహిళలు మరియు పురుషుల హాకీ జట్లకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాకీకి సంబంధించిన మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఒడిశా రాష్ట్రం వేదిక కానుంది. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్-2021 ఒడిశాలో జరగనుంది. ఒడిశాలోని కళింగ స్టేడియంలో నవంబర్ 24, 2021 నుంచి డిసెంబర్ 5, 2021 వరకు పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ నిర్వహించనున్నారు.
ఈ టోర్నమెంట్ లోగోను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం నాడు ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్ తో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఈజిప్ట్, కొరియా, మలేషియా, బెల్జియం, పాకిస్తాన్, కెనడా, ఇంగ్లాండ్, చిలీ, అర్జెంటీనా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, స్పెయిన్ వంటి 15 దేశాలు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి. కాగా 2016 లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ