కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 16,671 కరోనా కేసులు, 120 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,13,937 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,438 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,242 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 44,23,772 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,154 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 23027 యాక్టీవ్ కేసులు ఉండగా, త్రిస్సుర్ లో 21956, కోజికోడ్ లో 18876, మలప్పురంలో 16001, తిరువనంతపురంలో 14995, పతనంతిట్టలో 10019, అలప్పూజాలో 9612, పాలక్కాడ్ లో 9401 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 3,48,41,121 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ