కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 11,196 కరోనా కేసులు, 149 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,52,783 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,810 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 18,849 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 44,78,042 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,356 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 23582 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 16596, మలప్పురంలో 14116, తిరువనంతపురంలో 14002, త్రిస్సుర్ లో 13839, కొల్లంలో 10275, పతనంతిట్టలో 9300, పాలక్కాడ్ లో 9165, అలప్పూజాలో 8590 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,51,21,413 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ