మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25, ఆదివారం కూడా 66191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,95,027 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 64,760 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 61,450 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 35,30,060 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 82.19 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.51 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,98,354 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 2,57,49,543 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ