మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 16, బుధవారం నాడు 4304 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,80,893 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 48,434 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 4,678 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 17,69,897 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.1 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.58 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 61,454 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక బుధవారం నాటికీ మహారాష్ట్రలో నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 1,18,71,449 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ