దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు ముందు రోజుల కంటే కొంత తగ్గింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,866 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 25, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,05,621 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 41 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,26,074 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,50,877 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.46 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,50,877 (0.34%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 16,886 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,32,28,670 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక జూలై 24, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 87.27 కోట్లకు (87,27,59,815) చేరుకుంది. జూలై 24న 2,39,751 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY