దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,194 పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,642 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,37,567 (1.26%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 11,106 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,06,11,731 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.31 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.43 శాతంగా నమోదైంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో రికవరీ రేటు అధికంగా ఉండగా, మరణాల రేటు అతి తక్కువగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 14, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 20,62,30,512
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,09,04,940
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 13–ఫిబ్రవరి 14 (8AM-8AM)] : 12,194
- నమోదైన మరణాలు : 92
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,06,11,731
- యాక్టీవ్ కేసులు : 1,37,567
- మొత్తం మరణాల సంఖ్య : 1,55,642
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ