2020వ సంవత్సరానికి గాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్పీ) నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ రోజు ఉదయం డబ్ల్యూఎఫ్పీ ను శాంతి బహుమతికి ఎంపిక చేరినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆకలితో బాధపడుతున్నవారి కోసం డబ్ల్యూఎఫ్పీ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు, సేవలకుగానూ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినట్టు తెలిపారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచంలో ఆకలి బాధితులను ఆదుకునేందుకు అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. ఆహార భద్రతపై అవగాహన కల్పించడం, దాన్ని దేశాల మధ్య శాంతిసాధనంలా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో యుద్ధాలతో ఇబ్బందులు పడుతున్న దేశాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలును డబ్ల్యూఎఫ్పీ చేపట్టింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu