జీహెఛ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటుగా హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 13న శాసనసభ, అక్టోబర్ 14న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13న శాసనసభ సమావేశం ఉదయం 11:30 గంటలకు, అలాగే శాసన మండలి సమావేశం 14 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. 13న శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానాలను, 14న మండలిలో ప్రవేశపెడతారని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu