ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ అధ్యక్ష పదవీని చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. అలాగే ఆహారం మరియు ఇంధన భద్రత వంటి సమస్యలపై అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలకు వాయిస్ ఇవ్వడంతో సహా భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ యొక్క ప్రధాన ప్రాధాన్యతలను ప్రధాని మోదీ వివరించారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ నుండి తిరిగి రావాల్సి వచ్చిన భారతీయ విద్యార్థులు కొనసాగించాల్సిన విద్య కోసం ఏర్పాట్లను సులభతరం చేయాలని ఉక్రెయిన్ అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఇక ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఘర్షణల గురించి కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవాలన్న తన పిలుపును ప్రధాని మోదీ గట్టిగా పునరుద్ఘాటించారు మరియు తమ విభేదాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరుపక్షాలు చర్చలు మరియు దౌత్యానికి తిరిగి రావాలని అన్నారు. ఏదైనా శాంతి ప్రయత్నాలకు భారతదేశం యొక్క మద్దతును కూడా ప్రధాని తెలియజేశారు మరియు బాధిత పౌరులకు మానవతా సహాయం అందించడం కొనసాగించడానికి భారతదేశం యొక్క నిబద్ధతకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
మరోవైపు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్వీట్ చేస్తూ, “నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడి జీ-20 అధ్యక్ష పదవిని విజయవంతం చేయాలని కోరుకున్నాను. ఈ వేదికపైనే నేను శాంతి సూత్రాన్ని ప్రకటించాను మరియు ఇప్పుడు దాని అమలులో భారతదేశ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాను. ఐక్యరాజ్యసమితిలో మానవతా సహాయం మరియు మద్దతుకు కూడా కృతజ్ఞతలు తెలిపాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE