భారత-ఎ జట్టు క్రికెట్ క్రీడాకారులకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. అంటిగ్వా లో అనధికారికంగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో 4-1 తో భారత-ఎ జట్టు ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో బీసీసీఐ,జట్టు ప్రదర్శన పై ఆనందాన్ని వ్యక్తం చేసింది. భారత-ఎ జట్టు ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ట్విట్టర్లో బీసీసీఐ అధికారిక అకౌంట్ నుండి జరిగిన ఐదు మ్యాచ్ ల ఫలితాలను పోస్ట్ చేసింది. భారత-ఎ జట్టు మొదటి మూడు వన్డే మ్యాచ్ లు గెలిచింది, నాలుగవ వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది, తిరిగి మళ్ళీ ఐదవ వన్డే లో ఘన విజయం సాధించింది.
ఈ సిరీస్ లో భారత ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు, సిరీస్ లో రాణించి ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ విజయం సందర్భంగా శుభమన్ గిల్ కూడ ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భారత్ జట్టుకు ఆడదాన్ని ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో క్రునాల్ పాండ్యా, నవదీప్ సైని బౌలింగ్ లో రాణించారు. నవదీప్ సైని ఈ వన్డే సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించి, ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ తో తలపడే భారత జట్టులో చోటు సంపాదించాడు.
Congratulations to India A for clinching the 5-match one-day series against West Indies A 4-1. 👏
1st one-day – Won by 65 runs
2nd – Won by 65 runs
3rd – Won by 148 runs
4th – Lost by 5 runs
5th – Won by 8 wicketsReport – https://t.co/NXBaSMcJn1 pic.twitter.com/R8QWlKU6e2
— BCCI (@BCCI) July 22, 2019
Brilliant series win and happy to have won the player of the tournament. Always proud to wear the blue of India 🇮🇳💙 pic.twitter.com/t1u7CouAqk
— Shubman Gill (@RealShubmanGill) July 22, 2019