ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో పాల్గొనే జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓ బౌలర్ మరియు 10 మంది సహాయ సిబ్బంది కరోనా బారినపడినట్టు తెలుస్తుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బృందం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై సీఎస్కే యాజమాన్యం, ఐపీఎల్ కౌన్సిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఐపీఎల్ ప్రోటోకాల్స్ ప్రకారం జట్టు సభ్యులకు క్వారంటైన్ లో ఉన్న సమయంలో మొదటి, మూడవ మరియు ఆరవ రోజులలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు పరీక్షలలోనూ ఫలితం నెగటివ్ గా వస్తేనే వారిని ప్రాక్టీసుకి అనుమతి ఇస్తున్నారు. తాజాగా జట్టులో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్ సమయం మరికొంత కాలం పొడిగించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu