తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2932 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2932 కేసులతో కలిపి ఆగస్టు 27, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,415 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 799 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 87,675 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 1580 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 28,941 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 12 లక్షలు దాటింది. గురువారం నాడు 61,863 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 12,04,343 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 32,439 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu