ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షలు జరిమానా విధించారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ ఒక గంట 51 నిమిషాలు పాటుగా కొనసాగింది. దీంతో మినిమమ్ ఓవర్ రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఈ సీజన్లో చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన మొదటి తప్పిదంలో భాగంగా కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు.
మరోవైపు ఈ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (132-14×4,7×6) భారీ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు బెంగళూరుపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ మొదటి సెంచరీ నమోదు చేయడమే కాకుండా, ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఐపీఎల్లో వేగంగా 2వేల పరుగులు సాధించిన రికార్డును కూడా దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐపీఎల్లో 2వేల పరుగులను సచిన్ 63 ఇన్నింగ్స్లో చేరుకుగా, కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్ లోనే 2వేల పరుగులు సాధించాడు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu