కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణ ఎల్లా, కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కె.ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి.ప్రసాద్ మే 5, మంగళవారం నాడు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu