తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను జూలై 18, 19, 20 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) ప్రవేశ పరీక్షను జూలై 30, 31వ తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్-2022 ఫలితాలను శుక్రవారం ఉదయం కూకట్పల్లిలోని జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు 1,56,860 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,26,140 మంది అనగా 80.41 శాతం మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 80,575 మంది విద్యార్థులు హాజరుకాగా, 71,180 మంది అనగా 88.34 శాతం మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ముందుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇక తొందర్లోనే టీఎస్ ఎంసెట్-2022 కౌన్సిలింగ్ కూడా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
మరోవైపు పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్ విభాగంలో పోలు లోహిత్రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, నక్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ మూడో ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో జుతూరి నేహ మొదటి ర్యాంకు సాధించగా, వి.రోహిత్ రెండో ర్యాంకు, కె.తరుణ కుమార్ మూడో ర్యాంక్ సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY