ప్రముఖ చిత్రకారుడు ఎల్.గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కరోనా బారినపడిన చిత్రకారుడు గోపి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ