ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారుపై ధ్వజమెత్తారు. పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. రైతులని ఇబ్బంది పెట్టటానికి వ్యవసాయ చట్టాలు తెచ్చారు. గత రెండేళ్లుగా రైతులను ఏడిపిస్తున్నారు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. రైతులను ఇన్సల్ట్ చేసి మాట్లాడారు, లాఠీచార్జీలు చేశారు, గుర్రాలతో తొక్కించారు. మళ్లీ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల రాగానే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్ తీసుకొని స్వయంగా క్షమాపణ కోరుతున్నా అని ప్రధాని మాట్లాడారు అని సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గురించి అవమానకరంగా మాట్లాడారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. కానీ.. వాళ్ల కుటుంబం ఈదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. రాహుల్ గాంధీ.. తండ్రి, నానమ్మ ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అలాంటి నేతను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడుతారా? మహాభారతం, రామయణం, భగవద్గీత నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా? బీజేపీ అధ్యక్షుడినే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా.. బీజేపీ సంస్కారం ఇదేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ