తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవగా, నల్గొండలో ఎంసి కోటిరెడ్డి, ఆదిలాబాద్ లో దండె విఠల్, కరీంనగర్ జిల్లా స్థానం నుంచి భానుప్రసాద్ ఎన్నికల్లో గెలుపొందారు.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, భానుప్రసాద్, కోటిరెడ్డి, దండె విఠల్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ వీరి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మరియు బాల్క సుమన్, రాజయ్య, పెద్ది సుదర్శన్ సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు హాజరై పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, భానుప్రసాద్, కోటిరెడ్డి, దండె విఠల్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ