తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నల్గొండ జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 12 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని, ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంఖుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటుండంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతారనే ఆసక్తి ప్రజల్లో నెలకుంది. అలాగే నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా సీఎం స్పష్టత నిచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే పర్యవేక్షించారు. హాలియాలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ