తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ నోటీసులు అందుకున్న వారిలో ఒకరైన జగ్గుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపిన 41A సీఆర్పీసీ నోటీసులతో పాటు.. లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా కేసులో తన పేరుని చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం విచారిణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జగ్గుస్వామికి ఈ కేసులో ప్రమేయం ఉందని, ఆయన ఈ కేసులో కీలక నిందితులైన తుషార్ మరియు రామచంద్ర భారతిలకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో సిట్, ఈ విషయాలన్నీ హైకోర్టుకు తెలియపరచనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE