పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళే, ఖరారు చేసిన సోనియాగాంధీ

Candidates for Graduates MLC Elections, Chinna Reddy, Congress Party Candidates for Graduates MLC Elections, Mango News, MLC Candidates, MLC Elections, MLC elections in Telangana Today, Ramulu Naik, Sonia Gandhi, Telangana Latest News and updates, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, TRS MLC Candidates

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానానికి రాములు నాయక్, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి జి.చిన్నారెడ్డి లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇక టిఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీ చేయనున్నారని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్)‌ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కూడా బరిలోకి దిగారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =