తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జి.చిన్నారెడ్డి లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇక టిఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కూడా బరిలోకి దిగారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ