నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రకటించారు. మంగళవారం రాత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవలే కన్నుమూశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – మార్చి 23
- నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 30
- నామినేషన్ల పరిశీలన – మార్చి 31
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఏప్రిల్ 3
- పోలింగ్ జరిగే తేదీ – ఏప్రిల్ 17
- ఓట్ల లెక్కింపు – మే 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ