దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,903 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కు చేరుకుంది. కరోనాతో మరో 188 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,59,044 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2,34,406 (2.05%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (17864), కేరళ (1970), పంజాబ్ (1463), కర్ణాటక (1135) లలో 1,000 కి పైగా కొత్త కేసులను నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం, మరణాల రేటు 1.39 శాతం:
దేశంలో మరో 17,741 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,10,45,284 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.56 శాతం గానూ, మరణాల రేటు 1.39 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 28,903 కేసులలో 83.91% శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ