తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మాస్కు ధరించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మరోసారి పిలుపునిచ్చారు.
“కరోనా వైరస్తో పోరాడటం హైదరాబాద్లోని ప్రతి పౌరుడి బాధ్యత. మనం కరోనా మహమ్మారి యొక్క కీలకమైన దశలో ఉన్నాం. మీరు మీ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించండి” అని సీపీ అంజనీ కుమార్ సూచించారు. ఫేస్ మాస్క్ లేకుండా నగరంలోని బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారిపై జూలై 29, బుధవారం ఒక్కరోజే 2275 కేసులను బుక్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.
Fighting Corona virus is the responsibility of each and every citizen of Hyderabad. We are passing through a crucial phase of the pandemic. Wear MASK when you step out of your house . Yesterday we had to book 2275 cases against those moving at public places without Face Mask.
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) July 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu