దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 7 రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవుతుండగా, వరుసగా 21వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,34,154 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,84,41,986 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 2887 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,37,989 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 17,13,413 (6.02%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా తమిళనాడు (25,317), కేరళ (19,661), కర్ణాటక (16,387), మహారాష్ట్ర (15,169), ఆంధ్రప్రదేశ్ (12,768), వెస్ట్ బెంగాల్ (8,923), ఒడిశా (8,399), అస్సాం (4,178), తెలంగాణ (2,384), పంజాబ్ (2,214),వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 2,11,499 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,63,90,584 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 92.79 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ