ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లు రాజ్యసభకు ఎంపిక కావడంతో, తమ మంత్రి పదవులతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు జూలై 30, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరిగే ఏర్పాట్లన్నీ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఒక సీనియ అధికారిని నియమించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఆగస్టు 6
- నామినేషన్లకు ఆఖరితేదీ – ఆగస్టు 13
- నామినేషన్ల పరిశీలన – ఆగస్టు14
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఆగస్టు 17
- ఎన్నిక జరిగే తేదీ – ఆగస్టు 24
- పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – ఆగస్టు 24 సాయంత్రం 05:00 కు
- ఎన్నికల ముగింపు తేదీ – ఆగస్టు 26
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu