మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగ్సాన్ పల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంను మార్చి 19 శుక్రవారం నుంచి మార్చి 25 గురువారం వరకు వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ఈ ఆలయ కార్యనిర్వహణాధికారికి (ఈవో) కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో పూజారులు, ఇతర ఆలయ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దేవాలయ దర్శనాలను వారంరోజుల పాటుగా నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ