మునుగోడు ఉపఎన్నిక: కొత్త రిటర్నింగ్ ఆఫీసర్‌ ను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission of India Appoints New Returning Officer for Munugode Bye-election, TRS Working President KTR, Munugode Returning Officer Transfer, Munugode KTR Campigning, Mango News, Mango News Telugu, Telangana Chief Bandi Sanjay Kumar, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నికకు నూతన రిటర్నింగ్ ఆఫీసర్‌ (ఆర్వో) గా మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) బి.రోహిత్ సింగ్‌ నియమితులు అయ్యారు. రోహిత్‌ సింగ్‌ను ఆర్వోగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మునుగోడు ఉపఎన్నిక ఆర్వోగా ఉన్న జగన్నాథరావు స్థానంలో, రోహిత్ సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ముందుగా గురువారం ఉదయం మునుగోడు ఆర్వోపై ఈసీ వేటు వేసింది. మునుగోడు ఉపఎన్నికలో పోటీచేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్ తనకు ముందుగా రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయించి, ఆ తరవాత బేబీ వాకర్‌ గుర్తుకు మార్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకొని శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి ఆదేశాలు ఇచ్చింది. ఆ లోపుగానే మునుగోడు ఆర్వోను బదిలీచేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అనంతరం మునుగోడు కొత్త ఆర్వోగా రోహిత్‌ సింగ్‌ ను నియమిస్తునట్టు ఈసీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =