ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి పండుగకు ముందు రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. వారికి దీపావళి కానుకగా పోలీసు శాఖలోని 6,511 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పొలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాజా ఆదేశాలు ఇవ్వడంతో వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY