తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఛైర్పర్సన్తో పాటుగా మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీకాలం వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఐదు సంవత్సరాల ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్పర్సన్గా నియమితులైన సునీతా లక్ష్మారెడ్డి గతంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆమె 2019 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్, సభ్యుల వివరాలు:
- వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (ఛైర్పర్సన్)
సభ్యులు:
- షహీనా ఆఫ్రోజ్
- కుమ్ర ఈశ్వరీబాయి
- కొమ్ము ఉమాదేవి
- గద్దల పద్మ
- సుధామ్ లక్ష్మి
- కటారి రేవతీరావు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ