కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి ఈ రోజు నుంచే (మే 6, బుధవారం) అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. 15 కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని జోన్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమ్మకాలు ఉంటాయని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోతే అలాంటి ప్రాంతాల్లో వెంటనే అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. బార్లు, పబ్లు, క్లబ్బులకు అనుమతి లేదని అన్నారు. మద్యం ధరలు కూడా పెంచుతున్నట్టు తెలిపారు. చీఫ్ లిక్కర్ పై 11 శాతం, మరి కొన్ని రకాల మద్యంపై 16 శాతం ధరలు పెంచుతున్నట్టు చెప్పారు. మాస్కు ధరిస్తేనే మద్యం అమ్మాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే
ఆర్డినరీ రకం:
90ఎంఎల్/180 ఎంఎల్ : రూ.10 పెంపు
375 ఎంఎల్ : రూ.20 పెంపు
750 ఎంఎల్ : రూ.40 పెంపు
మీడియం రకం:
- 90ఎంఎల్/180 ఎంఎల్ : రూ.20 పెంపు
- 375 ఎంఎల్ : రూ.40 పెంపు
- 750 ఎంఎల్ : రూ.80 పెంపు
ప్రీమియం రకం:
- 90ఎంఎల్/180 ఎంఎల్ : రూ.30 పెంపు
- 375 ఎంఎల్ : రూ.60 పెంపు
- 750 ఎంఎల్ : రూ.120 పెంపు
స్కాచ్ :
- 90ఎంఎల్/180 ఎంఎల్ : రూ.40 పెంపు
- 375 ఎంఎల్ : రూ.80 పెంపు
- 750 ఎంఎల్ : రూ.160 పెంపు
బీర్లు : అన్ని సైజులపై ప్లాట్ రూ.30 పెంపు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu