రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమం మరియు పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ బీసి సంక్షేమం మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసి ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం, సమాఖ్యలు, వెనకబడిన తరగతుల వర్గాలకు స్వయం ఉపాధి పథకాలపై చర్చించారు.
చౌక ధరల దుకాణాలు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. వీటిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బిసి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ