తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ శివారులోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు ప్రారంభోత్సవ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ జరిగే ప్రాంగణాన్నిప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ గురువారం నాడు పరిశీలించారు.
సీఎం పర్యటన, ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ