దావోస్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా స్వీడన్ దేశానికి చెందిన ‘ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్’ సంస్థ హైదరాబాద్లో 207 కోట్లతో క్షయవ్యాధి (టీబీ) కిట్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగరం లోని జీనోమ్ వ్యాలీలో నెలకు 2 మిలియన్ల టీబీ డయాగ్నస్టిక్ కిట్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో తమ గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ పవన్ తో మంత్రి కేటీఆర్ సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు.
Another good news for Telangana from Davos!
Sweden headquartered EMPE Diagnostics announced the setting up of their global production facility for Tuberculosis diagnostic kits at Genome Valley in Hyderabad with capacity to produce 2 million kits per month.#InvestTelangana pic.twitter.com/1bkd3t05ye
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ” పురాతన అంటువ్యాధులలో క్షయవ్యాధి ఒకటని.. నేటికీ, వైద్య ప్రపంచానికి ఇది సవాలుగా మిగిలిపోయింది, ఇది దేశాలకు సామాజిక-ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ కోసం గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా హైదరాబాద్ ఉపయోగపడుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కంపెనీ ముందుగా రూ. 25 కోట్లు పెట్టుబడితో నెలకు 20 కిట్ల వరకు తయారు చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పవన్ అసలాపురం మంత్రి కేటీఆర్కు తెలిపారు. దీనిద్వారా దాదాపు 25 మందికి ఉపాధి కల్పించనున్నామని, త్వరలోనే మరో రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ