కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రహదారులను అనధికారికంగా మూసివేయడంపై జోక్యం చేసుకుని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి కేటీఆర్ కోరారు. రోడ్లను మూసివేయడంతో హైదరాబాద్ నగరంలో ఉత్తర మరియు ఈశాన్య భాగాలలో నివసిస్తున్న మిలియన్ల మంది పౌరులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ యాక్ట్ 2006 లోని సెక్షన్ 258 ప్రకారం ఈ రహదారులను వెంటనే తెరవడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే సరైన ప్రక్రియలను పాటించకుండా పబ్లిక్ రహదారులను మూసివేయడంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా హైదరాబాద్ లోకల్ మిలిటరీ అథారిటీలకు అవసరమైన సూచనలను పంపించాలని కేంద్రమంత్రిని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ లేఖను జత చేశారు.
Please pass necessary instructions to the LMA Hyderabad to immediately open these roads & restrain them from taking unilateral & arbitrary decisions on closure of the public roads without following due process, as contemplated under Section 258 of Cantonment Act 2006
— KTR (@KTRTRS) July 15, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ