కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆగస్టు 9, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ప్రారంభించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రేషన్ కార్డు యొక్క పోర్టబిలిటీ విధానం ఆగస్టు 9 నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలు ఎక్కడినుంచైనా సరుకులను తీసుకునే వెసులు బాటు కలుగుతుంది.
హైదరాబాద్ లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ నేషన్-వన్ రేషన్ విధానాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేస్తునట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డు వివరాలను, తెలంగాణ లోని రేషన్ కార్డు వివరాలను నేషనల్ పోర్టబిలిటీ ద్వారా అనుసంధానం చేసామని, ఇక తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ ద్వారా సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన కార్డులకు మాత్రమే ఈ పోర్టబిలిటీ విధానం వర్తిస్తుందని సమాచారం. మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల్లో కూడ ఈ విధానం శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలియజేసారు.
[subscribe]
[youtube_video videoid=41EY7re-GGc]