తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్యాంపస్, అనుబంధ, డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీలలో పీజీ (ఎంఏ/ఎంకామ్/ఎంకామ్(ఐఎస్)/ఎంఎస్డబ్ల్యు/ ఎంఎస్సీ/ఎం.లిబ్.ఐ.ఎస్సీ/ఎంజే అండ్ ఎంసీ…) కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం జూన్ 22 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇక రూ.300 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించునేందుకు ఆఖరు తేదీని జూన్ 28 గా నిర్ణయించారు. ఈ పరీక్షల నోటిఫికేషన్ వివరాలను ఓయూ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ