నేటి నుంచి శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు, ప్రారంభమైన 12 రోజుల మహా క్రతువు

Inauguration of Samatha Murthy Statue, Muchintal, ramanuja statue inauguration, ramanujacharya statue in hyderabad, Samatha Moorthi Sri Ramanujacharya Statue, Samatha Murthy Statue, statue of equality inauguration, Statue of Equality Sri Ramanujacharya, Statue of Equality Sri Ramanujacharya Millennium Celebration Starts, Statue of Equality Sri Ramanujacharya Millennium Celebration Starts at Chinna Jeeyar Swamy Ashram, Statue of Equality Sri Ramanujacharya Millennium Celebration Starts at Chinna Jeeyar Swamy Ashram at Muchintal

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌ ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా మొదలయ్యాయి. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా, ముచ్చింతల్‌ లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ‘సమతామూర్తి’ అని నామకరణం చేసిన 216 అడుగుల స్వర్ణమయ శ్రీ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వందలాది మంది వాలంటీర్లు, రుత్విక్కులు, సాధుసంతుల రాకతో ఆశ్రమంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఆశ్రమంలో అలంకరించిన పుష్పాలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా మారాయి. ఆశ్రమంలోని వాతావరణం వచ్చే భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తోంది. అష్టాక్షరీమంత్ర జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమయ్యింది.

వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఆ మహనీయుడు జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చిన్న జీయర్‌స్వామి తెలిపారు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్న సమయంలో ఆయన నింపిన స్ఫూర్తి మరోసారి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందంటూ చిన్నజీయర్‌ స్వామి ఈ బృహత్‌ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ ఈ సాయంత్రం మొదలవనుంది. ముందుగా ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ నిర్వహణ, 1035 కుండాలతో లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభం కానున్నాయి. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

రోజువారి షెడ్యూల్:

  • ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు – అష్టాక్షరీ మహామంత్ర జపం పారాయణం
  • ఉదయం 8 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు
  • ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు – రోజువారీ హోమాలు
  • మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 1గంట వరకు – రోజువారీ పూర్ణాహుతి మరియు ప్రసాదం
  • సాయంత్రం 4.30 గంటలకు – రోజువారీ సాయంత్రం హోమం ప్రారంభం
  • సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు – శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
  • సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు – ముఖ్య అతిథులకు సన్మానం
  • రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు. – శ్రీ రామానుజాచార్యులపై లైవ్ షో
  • రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకు – రోజువారీ సాయంత్రం పూర్ణాహుతి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 3 =