తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 2,850 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 1, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,66,761 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,391 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 94.82 శాతంకాగా, మరణాల రేటు 0.53 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 4,391 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,27,045 కు చేరుకుంది. ప్రస్తుతం 35,625 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం నాడు 94,020 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,22,13,954 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,65,501 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 3,205 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ