తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 8, ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో తమిళిసై సౌందర రాజన్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్ చౌహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తోలి మహిళా గవర్నర్ గా తమిళిసై గుర్తింపు పొందనున్నారు.
ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి మంగళవారం నాడు చెన్నై చేరుకుని తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక పత్రాన్ని ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున అందజేశారు. అయితే మొదటిగా ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 8వ తేదీనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ నెల 11న గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=UQKS_4QljTE]